24న మండల కేంద్రాల్లో కాంగ్రెస్ నిరసన

 24న మండల కేంద్రాల్లో కాంగ్రెస్ నిరసన

భూ సమస్యలు, రైతు సమస్యలపై పోరాటం ఉధృతం చేయాలని కాంగ్రెస్ నిర్ణయిచింది. ఈ నెల 24న మండల కేంద్రాలు, 30న నియోజకవర్గ కేంద్రాలు, డిసెంబర్ 5న కలెక్టరేట్ల ముందు ఆందోళన చేయాలని డిసైడ్ అయింది.

ఈ ప్రోగ్రాంలను విజయవంతం చేయడానికి 32 జిల్లాలకు కో ఆర్డినేటర్లను నియమించింది. ధరణి పోర్టల్ వచ్చాక భూ సమస్యలు విపరీతంగా పెరిగాయని కాంగ్రెస్ నేతలు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే భూ తగాదాలకు కారణమైందని ఆరోపిస్తున్నారు. పోడు సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.