V6 News

తలసాని ఏ ఎండకు ఆ గొడుగు పడ్తడు

తలసాని ఏ ఎండకు ఆ గొడుగు పడ్తడు

హైదరాబాద్, వెలుగు: టీఆర్‌‌ఎస్‌‌  పెద్దలు, పోలీసులు కుమ్మక్కయి కాంగ్రెస్ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని ఆ పార్టీ జాతీయ​అధికార ప్రతినిధి దాసోజ్​శ్రవణ్​ఆరోపించారు. పోలీసాఫీసర్లు అధికార పార్టీకి తాబేదార్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్, హైదరాబాద్​పోలీస్​కమిషనర్​అంజనీకుమార్​లపై మండిపడ్డారు. తలసాని ఏ ఎండకు ఆ గొడుగు పడ్తడని ఎద్దేవా చేశారు. టీడీపీలో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ ను అనరాని మాటలన్న తలసాని ఇప్పడు నిత్యం పొగుడుతున్నాడన్నారు. కేసీఆర్​ను తిట్టిన సంగతి మరిసినవా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పని చేసిన  తలసానికి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తలాతోక లేకుండా మాట్లాడే తలసానికి ఉత్తమ్​కుమార్​రెడ్డిపై కామెంట్స్​చేసే స్థాయి లేదన్నారు. ఉత్తమ్​కాల్​చేస్తే సీపీ అంజనీకుమార్​మర్యాదగా మాట్లాడలేదని ఆరోపించారు. జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీతో పోలీస్​అధికారి మాట్లాడే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. సీపీ మాట తీరు మార్చుకోవాలని సూచించారు. ఆంధ్రాకు చెందిన ఈ ఐపీఎస్​తెలంగాణాలో అవసరమా అని కామెంట్ చేశారు. ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ మాట్లాడిన తీరుపై స్పందిస్తూ  నిబద్ధతతో పని చేసే ఐపీఎస్ లను తమ పార్టీ అనడం లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కానిస్టేబుల్​నుంచి పై స్థాయి పోలీసాఫీసర్ల వరకు అందరూ టీఆర్​ఎస్​నేతల మాటలే వింటున్నారని ఆరోపించారు. పోలీసులు కాంగ్రెస్​ర్యాలీకి ఎందుకు అనుమతి ఇవ్వలేదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో అంజన్ కుమార్ యాదవ్, ప్రేమ్​లాల్ తదితరులు పాల్గొన్నారు.