బీజేపీలోకి నటి ఖుష్బూ?

బీజేపీలోకి నటి ఖుష్బూ?

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేషనల్ స్పోక్స్ పర్సన్, యాక్ట్రెస్ ఖుష్బూ సుందర్ సోమవారం ఢిల్లీలో బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో బీజేపీలో ఖుష్బూ చేరిక ఖాయమైం దని చెప్పుకుంటున్నారు. సోమవారం తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ ఎల్ మురుగన్ తో పాటు వెళ్లి.. ఢిల్లీలో పార్టీ సెంట్రల్ టీమ్ ను ఖుష్బూ కలవనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. సోమవారం నాటికి దీనిపై పూర్తి క్లారిటీ వస్తుందని తెలిపారు. ఆమె పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఆదివారం చెన్నై ఎయిర్ పోర్టులో ఉన్న ఖుష్బూను.. బీజేపీలో చేరేందుకు ఢిల్లీకి వెళ్తున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా ఆమె మాట్లాడేందుకు నిరాకరించారు. ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. తాను ఏ విషయంపైనా మాట్లాడనని చెప్పారు. అయితే శనివారం మాత్రం ఖుష్బూ తన ట్విట్టర్ అకౌంట్ లో ‘మార్పు అనివార్యం’ అని అర్థం వచ్చేలా ఓ ట్వీట్ చేశారు. ఖుష్బూ 2010లో డీఎంకేలో పొలిటికల్ కెరీర్ ప్రారంభించారు. 2014లో కాంగ్రెస్ లో చేరారు. గత జులైలో కేంద్రం తెచ్చిన కొత్త ఎడ్యుకేషన్ పాలసీకి ఆమె మద్దతివ్వడంతో కాంగ్రెస్ తో చెడిందని ఊహాగానాలు సాగాయి.