అధికారంలోకి రాగానే ఇండ్లు కట్టిస్తాం: పొన్నం

అధికారంలోకి రాగానే ఇండ్లు కట్టిస్తాం: పొన్నం

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులైన నిరు పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మనగర్ లో గుడిసెలు వేసుకుని ఉంటున్న నిరుపేదలను కలిశారు పొన్నం ప్రభాకర్. 30 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని ఉంటున్నామని.. ఇప్పటికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వలేదని పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు నిరుపేదలు.

తమకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వకపోగా SRSP స్థలంలో ఉన్నారంటూ గుడిసెలు కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇండ్లు కట్టించి ఇస్తామని నిరుపేదలకు భరోసా ఇచ్చారు పొన్నం ప్రభాకర్.