బెంగళూరు: పనితీరు ఆధారంగానే ఈ సారి టికెట్లు కేటాయిస్తామని, పనిచేయకుండా.. లాయల్టీ, సీనియరిటీ అంటే కుదరదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సభకు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రాన్ని, దేశాన్ని బీజేపీ ప్రభుత్వాలు భ్రష్టు పట్టించాయని ఆరోపించారు. బీజేపీ తప్పిదాలను ఎండగట్టే దిశగా నేతలు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. రానున్న శాసన సభ ఎన్నికల్లో కనీసం 150 స్థానాల్లో గెలవాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు పార్టీ నేతలంతా కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.
LIVE: Addressing Karnataka Pradesh Congress Committee Extended Executive Meeting in Bengaluru, Karnataka https://t.co/X5LjQnbZ4k
— Rahul Gandhi (@RahulGandhi) April 1, 2022