ఢిల్లీలో రైతులను కాల్చి చంపుతారా : సుజాత పాల్

ఢిల్లీలో రైతులను కాల్చి చంపుతారా : సుజాత పాల్

హైదరాబాద్, వెలుగు:  తమ న్యాయమైన సమస్యల సాధన కోసం ఢిల్లీలో ఆందోళన చేస్తే ఓ యువ రైతును మోదీ సర్కార్  కాల్చి చంపిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి సుజాత పాల్ ఆరోపించారు. ఈ ఘటనతో  బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వమని నిరూపించుకున్నదన్నారు. గురువారం ఆమె గాంధీ భవన్ లో  మీడియాతో మాట్లాడారు. మోదీ సర్కార్ పై  ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. 

తమ పంటలకు మద్దతు ధరను చట్టబద్ధం చేయాలని రైతులు అడిగితే వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం ఏమిటని ప్రశ్నించారు. మోదీ ప్రధాని అయినందుననే తమ సమస్యలను ఆయనకు చెప్పుకునేందుకు రైతులు వస్తున్నరని చెప్పారు. దానికే రైతులపై అరాచకం చేయడం ఎంతవరకు సమంజసమని సుజాత పాల్ నిలదీశారు.