కేటీఆర్ పై ఉత్తమ్.. హరీష్ రావుపై కోమటిరెడ్డి పోటీ!

 కేటీఆర్ పై ఉత్తమ్..  హరీష్ రావుపై  కోమటిరెడ్డి పోటీ!

అసెంబ్లీ ఎన్నికల్లో రెండుచోట్ల పోటీకి సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ నేతలు. కొడంగల్ తోపాటు కామారెడ్డి నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు పీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ పై పోటీ చేయాలని రేవంత్ రెడ్డిని పార్టీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుపై  ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి పోటీ చెయ్యాలనుకుంటున్నట్లు సమాచారం. 

హుజుర్ నగర్ తోపాటు సిరిసిల్లలో పోటీ కి సై అంటున్నారు ఉత్తమ్. నల్లగొండతో పాటు సిద్దిపేటలో పోటీకి రెడీ అవుతున్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.  ఇక కాంగ్రెస్ లో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు తోపాటు అధిష్ఠానం ఆదేశిస్తే గజ్వేల్ లో బరిలోకి దిగుతానంటున్నారు. 

Also Read :- రైతు బంధు ఆపేందుకు కాంగ్రెస్ కుట్ర

సీఎల్పీ నేత భట్టి కూడా రెండు సీట్లపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.  కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను కట్టడి చేసే ఆలోచనలో భాగంగానే కాంగ్రెస్ అధిష్టానం రెండుచోట్ల పోటీపై దృష్టిపెట్టినట్లు సమాచారం. ఎన్నికల ప్రచారానికి బయటికే వెళ్లకుండా కట్టడికి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ వార్ రూమ్ డైరెక్షన్ లోనే  రెండు సీట్లలో పోటీ చేయాలన్న నిర్ణయానికొచ్చినట్లు  సమాచారం. ఈ విషయం ఫైనల్ అయ్యాకే సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.