
జైపూర్, వెలుగు: కాంగ్రెస్ పార్టీని, మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని విమర్శించే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదని కాంగ్రెస్ జైపూర్ మండల ప్రెసిడెంట్ ఫయాజుద్దీన్, జనరల్ సెక్రెటరీ బోన్ల తిరుపతి రాజ్ అన్నారు. బీఆర్ఎస్ నేత రాజా రమేశ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. గురువారం మండల కాంగ్రెస్ లీడర్లతో జైపూర్లో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తూ బాల్క సుమన్ మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
బీఆర్ ఎస్ పదేండ్ల పాలనలో ఒక్క కుటుంబానికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను దఫాలుగా అమలు చేస్తోందని, చెన్నూర్ నియోజకవర్గంలో 3500 మంది పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీని, మంత్రి వివేక్ ను విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు రమేశ్, నాయకులు రవి, అనిల్ కుమార్, వెంకటేశ్, షారుక్, కార్యకర్తలు పాల్గొన్నారు.