న్యూఢిల్లీ: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు డీఏ, డీఆర్ పెంపు, ఏరియల్స్ ను నిలిపి వేయడంపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతోపాటు మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్సింగ్ లో పాల్గొన్నారు. కష్టకాలంలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగులు, ఆర్మ్డ్ ఫోర్సెస్ పై ఇలాంటి భారం వేయాల్సిన అవసరం లేదని మన్మోహన్ సింగ్ తెలిపారు. వారి తరఫున మనం నిలబడాల్సిన సమయం ఇదన్నారు. రాహుల్ గాంధీ దీన్నో అమానవీయ చర్యగా పేర్కొన్నారు. సెంట్రల్ విస్టా సుందరీకరణ కోసం చేస్తున్న దుబారాగా ఖర్చు చేస్తున్నారని రాహుల్ విమర్శించారు. సెంట్రల్ విస్టాను ఇప్పుడే నిర్మిస్తున్నారని.. దానికయ్యే దుబారా ఖర్చు గురించి ఆలోచించరని మండిపడ్డారు. మిడిల్ క్లాస్ నుంచి డబ్బులు తీసుకొని పేద ప్రజానీకానికి ఇవ్వట్లేదన్నారు. ఆ డబ్బులను సెంట్రల్ విస్టా కోసం వెచ్చిస్తున్నారని దుయ్యబట్టారు. బుల్లెట్ ట్రెయిన్, సెంట్రల్ విస్టా డెవలప్ మెంట్ పై వెనక్కి తగ్గని కేంద్రం ఉద్యోగుల డీఏను మాత్రం కత్తెర వేసిందని.. ఫస్ట్ ఆ రెండు ప్రాజెక్టులకు డబ్బులు నిలిపేయాలని చిదంబరం చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్ నెస్ అలవెన్స్ (డీఏ), డియర్ నెస్ రిలీఫ్ (డీఆర్) పెంపును నిలిపేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ డెసిషన్ తీసుకున్నట్లు కేంద్రం ఓ మెమొరాండంలో తెలిపింది. ఏరియర్స్ కూడా పే చేయబోమని తెలిపింది. దీని వల్ల 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు కలిపి రూ.37,350 కోట్లను మిగిల్చుకోవాలని కేంద్రం అనుకుంటోంది. సెంట్రల్ విస్టా రీడెవలప్ మెంట్ కోసం రూ.20 వేల కోట్లు, అహ్మదాబాద్ నుంచి ముంబై కి బుల్లెట్ ట్రెయిన్స్ రూట్ నిర్మాణానికి కు రూ.5,600 కోట్లను కేంద్రం కేటాయించింది.
ఉద్యోగులకు డీఏ, డీఆర్ నిలిపివేతపై కాంగ్రెస్ ఫైర్
- దేశం
- April 25, 2020
లేటెస్ట్
- రాజ్యాంగాన్ని రక్షిస్తం .. రిజర్వేషన్లను పెంచుతం : రాహుల్ గాంధీ
- ప్రజలు దృష్టి డైవర్ట్ చేయడానికే కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులు : జగదీష్ రెడ్డి
- Health Alert: ఇవి తింటే సంపూర్ణ ఆరోగ్యం..ఐసీఎంఆర్ చెబుతోంది
- పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపిన ఐకాన్ స్టార్.. ట్వీట్ వైరల్
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- చంద్రబాబు డబ్బులు ఇస్తే తీసుకోండి... ఓటు మాత్రం నాకే వేయండి.. సీఎం జగన్
- SRH vs LSG: బదోనీ బౌండరీ.. తట్టుకోలేక అరిచేసిన కావ్య మారన్
- కొత్త స్ట్రాటజీ : ఓలా, ఉబెర్ తరహా వ్యాపారంలోకి Paytm
- శివకాశిలో ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
- అక్షయ తృతీయ ప్రత్యేకత ఏంటి.. ఆరోజు ఏమేమి జరిగాయో తెలుసా
Most Read News
- తెలంగాణలో మూడు రోజులు వైన్స్ బంద్
- SRH vs LSG: పొట్టు పొట్టు కొట్టిన సన్రైజర్స్ ఓపెనర్లు.. 10 ఓవర్లలోపే మ్యాచ్ ఫినిష్
- 24 గంటలుగా కరెంట్ లేదు: చందానగర్ సబ్స్టేషన్ ముందు స్థానికుల ఆందోళన
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- మధురానగర్లో సాఫ్ట్వేర్ ఫ్యాకల్టీ దారుణ హత్య
- SRH vs LSG: కట్టడిచేసిన సన్రైజర్స్ బౌలర్లు.. ఇక బ్యాటర్లపైనే భారం
- OMG : మీరు ఎక్కువగా కార్లలో తిరుగుతున్నారా..క్యాన్సర్ రావొచ్చంట..!
- రూ.20 వేలకు మించి క్యాష్ లోన్ ఇవ్వొద్దు