జవహర్ నగర్, వెలుగు: వరద బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ సీఎం, మంత్రుల ఫొటోల వద్ద కాంగ్రెస్ నేతలు సోమవారం పిండ ప్రదానం చేశారు. మల్లెపూల శ్రీకాంత్ ఆధ్వర్యంలో జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధి చెన్నాపురం చెరువు వద్ద సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి ఫొటోలకు పిండ ప్రదానం చేసి నిరసన వ్యక్తం చేశారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ.. వరద నీటిలో చిక్కుకున్న కాలనీలను గుర్తించి వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలన్నారు.