కాంగ్రెస్ కు మైనార్టీ విభాగం చైర్మన్ రాజీనామా

కాంగ్రెస్ కు మైనార్టీ విభాగం చైర్మన్ రాజీనామా

ఖైరతాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ విభాగం చైర్మన్ షేక్​ అబ్దుల్ సొహై రాజీనామా చేశారు. తన రిజైన్ లేటర్​ను కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకి పంపారు. అసలైన కాంగ్రెస్​ నాయకులకు పార్టీ టిక్కెట్లు ఇవ్వడం లేదని తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. పైసలు తీసుకుని బీఆర్ఎస్, బీజేపీ నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. తాను 34 ఏండ్లుగా కాంగ్రెస్​​లో ఉన్నానని.. ఇన్నేండ్లల్లో  ఒక్కసారి కూడా మలక్​పేట టికెట్ దక్కించుకున్న వ్యక్తి మొహం చూడలేదని షేక్ అబ్దుల్ సొహైల్ పేర్కొన్నారు.