ప్రభుత్వాన్ని పొగిడితేనే సమయం ఇస్తారా?  

ప్రభుత్వాన్ని పొగిడితేనే సమయం ఇస్తారా?  

హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడటానికి సమయం ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క చేసిన కామెంట్లు సభలో హీటెక్కించాయి. ప్రభుత్వాన్ని పొగిడితేనే సమయం ఇస్తారా అని  ఆమె గరం అయ్యారు. ‘గ్రామాలకు ఇచ్చే నిధులు సరిపోతున్నాయా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. గ్రామ పంచాయితీ నిధులు దారిమళ్లుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి. గ్రామ పంచాయితీ సమస్యలపై మాట్లాడితే సర్కార్‌కు ఎందుకంత ఉలిక్కిపాటు?. మేం మాట్లాడితే ఎందుకు అడ్డుపడుతున్నారు? మీ అంత మేధావులం కాదు’ అని సీతక్క మండిపడ్డారు. ప్రభుత్వాన్ని పొగిడితేనే సమయం ఇస్తారా అంటూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని సీతక్క క్వశ్చన్ చేశారు. ప్రజల తరపున ప్రశ్నలు అడుగుతున్నామని.. సమస్యలు సభ దృష్టికి తీసుకురావొద్దా అంటూ ఆమె ఫైర్ అయ్యారు.