మోడీపై రాహుల్​ గాంధీ ఫైర్

మోడీపై రాహుల్​ గాంధీ ఫైర్

న్యూఢిల్లీ: చేతబడి(బ్లాక్ మ్యాజిక్) లాంటి మూఢనమ్మకాల గురించి మాట్లాడి మోడీ ప్రధాన మంత్రి పదవికి ఉన్న గౌరవాన్ని తగ్గిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా గురువారం ఆయన ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. దేశంలో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగాఈ నెల5న కాంగ్రెస్ నేతలు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. ఈ నిరసనను తప్పుబడుతూ.. చేతబడిని నమ్మేవారు ప్రజల నమ్మకాన్ని పొందలేరని ప్రధాని మోడీ కామెంట్​ చేశారు. దీనికి కౌంటర్​గా ‘దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగాన్ని ప్రధాని చూడలేకపోతున్నారా’ అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. "ప్రధాన మంత్రి పదవికి ఉన్న గౌరవాన్ని తగ్గించడం మానేయండి.. బ్లాక్ మ్యాజిక్ వంటి మూఢనమ్మకాల గురించి మాట్లాడి దేశాన్ని తప్పుదోవ పట్టించకండి" అని రాహుల్ ట్వీట్ చేశారు.