కాంగ్రెస్ ​ఆస్తుల పునరుద్ధరణకు కమిటీ

కాంగ్రెస్ ​ఆస్తుల పునరుద్ధరణకు కమిటీ

హైదరాబాద్, వెలుగు: ఆస్తుల పునరుద్ధ రణకు కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. ఈ మేరకు మంగళవారం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్​పార్టీ ఆస్తుల పునరుద్ధరణ పేరుతో కమిటీని పీసీసీ చీఫ్​ రేవంత్ ​రెడ్డి నియమించారు. కమిటీకి చైర్మన్​గా పి.సుదర్శన్ రెడ్డి, కన్వీనర్​గా సౌదాగర్​ గంగారాంలను నియమించారు. సభ్యులుగా జి. నిరంజన్,  దయా సాగర్ ​రావు, పొన్నం అశోక్​ గౌడ్​, ఎం.రామచంద్రా రెడ్డి, టి.బెల్లయ్య నాయక్​, ఎంఏ ఫహీంలను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు.