రాష్ట్రంలో భూసమస్యలు పరిష్కరించాలని సీఎస్ సోమేష్ కుమార్కు కాంగ్రెస్ నేతల బృందం మెమోరాండం అందజేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు సీఎస్ ను కలిశారు. ధరణి పోర్టల్ని రద్దు చేసి పాత పద్దతిని తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిషేధిత జాబితాలో పొరపాటుగా నమోదైన భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు.
అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి..పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కోరారు. అర్హులైన వారికి అసైన్డ్ భూములకు పట్టాలివ్వాలన్నారు. కౌలు రైతు చట్టాన్ని అమలు చేసి..కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని సూచించారు. అదేవిధంగా టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని అమలు చేయాలని చెప్పారు.