ఎర్రవల్లి రూట్లో భారీగా మోహరించిన పోలీసులు

ఎర్రవల్లి రూట్లో భారీగా మోహరించిన  పోలీసులు

సిద్ధిపేట జిల్లా: మర్కుక్ మండలం ఎర్రవల్లికి వెళ్లే రూట్లో  పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. స్థానిక గ్రామాల ప్రజలను కూడా తనిఖీలు చేసిన తర్వాత అనుమతిస్తున్నారు. ఐడీ కార్డులు చూపించిన తర్వాత పంపిస్తున్నారు పోలీసులు. ఇవాళ ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ ఫాం హౌజ్ పరిసర ప్రాంతాల్లో కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమానికి ప్లాన్ చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భద్రతను పెంచారు పోలీసులు. చెక్ పోస్టు దగ్గర సీపీ శ్వేత పరిస్థితులను పరిశీలించారు.