కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లలో గెలుస్తది

కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లలో గెలుస్తది
  •  బీజేపీ, బీఆర్ఎస్​కు అభ్యర్థులే దొరకడం లేదు: మల్లు రవి

న్యూఢిల్లీ, వెలుగు: రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో కనీసం 14 సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుందని ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల కోసం వెతుక్కుంటున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. షెడ్యూల్ రాక ముందే రాజకీయ స్వలాభం కోసం ఆ రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నా యని విమర్శించారు. మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను ఖర్గేకు వివరించారు. నాగర్ కర్నూల్ సీటు తనకు కేటాయించాలని కోరారు.