సంగారెడ్డి: రాజ్యంగ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. రాజ్యంగం ఉండగానే ప్రజల బతుకులు ఆగమైతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో రాజ్యంగ పరిరక్షణ యాత్ర చేస్తామని ప్రకటించారు కోదండరాం. నెల రోజుల పాటు యాత్ర ఉంటుందన్నారు. ఇవాళ సంగారెడ్డి పట్టణంలో తెలంగాణ జన సమితి రెండవ ప్లీనరీ సమావేశంలో టీజేఎస్ చీఫ్ కోదండరాం పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల భూములకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దళితుల భూములను గుంజుకుంటున్నారని మండిపడ్డారు. నిమ్జ్ భూ బాధితుల కోసం ధర్నా చేసినందుకు తమపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి