
మధ్యప్రదేశ్ : కరోనా ఎఫెక్ట్ తో ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అందాల పోటీలో అమ్మాయిలు మాస్కులు వేసుకుని పాల్గొన్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరోనా నివారణలో భాగంగా తమవంతు ప్రచారాన్ని ఇలా చేశామని తెలిపారు అందెగంతెలు. మధ్యప్రదేశ్ లోని జబల్పూర్లో శుక్రవారం జరిగిన అందాల పోటీల్లో మాస్కులు వేసుకొని ఇలా ఫొటోలకు పోజులిచ్చారు అమ్మాయిలు.