భారత్ లో కేసులు 70 లక్షలు..60 లక్షలు దాటిన రికవరీ

భారత్ లో కేసులు 70 లక్షలు..60 లక్షలు దాటిన రికవరీ

భారత్ లో కరోనా కేసుల ఉదృతి కొనసాగుతుంది. కరోనా పాజిటివ్ కేసులు 70 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 74,383 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 70,53,807 కు చేరింది. మరో 918 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య1,08,334 కు చేరింది. నిన్న ఒక్కరోజేే 89,154 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు 60,77,977 మంది డిశ్చార్జ్ అయ్యారు.  ఇంకా 8,67,496 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆక్టివ్ కేసులు 12.30 శాతం, రికవరీ రేటు 86.17 శాతం మరణాల రేటు 1.54 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజే 10,78,544 టెస్టులు చేశారు. వీటితో కలిపి దేశంలో అక్టోబర్ 10 నాటికి కరోనా టెస్టుల సంఖ్య మొత్తం 8 కోట్ల 68 లక్షల 77 వేల 242 కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.