తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో రోజు వారీ కరోనా కేసులు నమోదయ్యాయి.. నిన్న ఒక్కరోజే 62973 మందికి టెస్టులు చేయగా..1321 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల12 వేల140 కి చేరింది. నిన్న ఒక్కరోజే 5 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య రాష్ట్రంలో 1717కి చేరింది. మరో 293 మంది కోలుకోవడంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3లక్షల2వేల500కి చేరాయి. మరో 7923 మంది ఇంకా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో144, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 121 నమోదయ్యాయి.