KGBకాలేజీలో ముగ్గురు విద్యార్థినులకు కరోనా

 KGBకాలేజీలో ముగ్గురు విద్యార్థినులకు కరోనా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల (KGB)కళాశాలలో ముగ్గురు విద్యార్థినులు కరోనా బారిన పడ్డారు. ఇద్దరు విద్యార్థినులు రెండు రోజులుగా జలుబు,దగ్గుతో బాధపడుతున్నారు. నిన్న(బుధవారం) రాత్రి జ్వరం రావడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టెస్టు చేయించారు. ఇదరికీ పాజిటివ్ రావడంతో అప్రమత్తమైన టీచర్స్ .. మిగతా విద్యార్థులకు టెస్టులు చేయించారు. మరో విద్యార్థినికి పాజిటివ్ వచ్చింది. ముగ్గురిని హాస్టల్ లో ఐసోలేషన్ లో ఉంచారు.