అంబులెన్స్ ఇయ్యలే.. సిబ్బంది రాలే.. ట్రాక్ట‌ర్ లోనే మృత‌దేహం త‌ర‌లింపు

అంబులెన్స్ ఇయ్యలే.. సిబ్బంది రాలే.. ట్రాక్ట‌ర్ లోనే మృత‌దేహం త‌ర‌లింపు

జగిత్యాల : ప్ర‌భుత్వం ఎంత‌గా చెబుతున్నా క‌రోనాతో చ‌నిపోయిన వారి ప‌ట్ల ఆసుప‌త్రి సిబ్బంది మాత్రం నిర్ల‌క్ష్యంగానే వ్య‌వ‌హరిస్తున్నారు. క‌రోనాతో చ‌నిపోయిన వారిని మృత‌దేహ‌ల‌ను త‌ర‌లించేందుకు అంబులెన్స్ ల‌ను కూడా ఏర్పాటు చేయడం లేదు. జగిత్యాల పట్టణంలోని ద్వారకా నగర్ కు చెందిన ఓ వ్యక్తి కరోనా బారిన ప‌డి జిల్లా ఆస్పత్రిలో చేరాడు. అయితే ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతూ సోమ‌వారం ఉదయం మ‌ర‌ణించాడు. ఆసుప‌త్రి సిబ్బంది అత‌ని మృత‌దేహాన్ని త‌ర‌లించ‌డానికి అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయ‌కపోవ‌డంతో స్థానిక మున్సిపల్ సిబ్బందే ఆ బాధ్య‌తను తీసుకుంది. అత‌ని మృతదేహాన్ని ట్రాక్టర్ లోనే శ్మ‌శాన వాటికకు తరలించి, అత‌ని అంత్యక్రియలు నిర్వహించింది.