
యాదాద్రి భువనగిరి జిల్లా: బొమ్మలరామారంలో కరోనా కలకలం రేపుతోంది. ఆత్మహత్య చేసుకున్నవ్యక్తికి చనిపోయాక కరోనా పాజిటివ్ అని తేలడంతో గ్రామస్థులు భయంతో వణికిపోతున్నారు. ఆ వ్యక్తి అంత్యక్రియల్లో సుమారు 500 మంది పాల్గొన్నారు. దీంతో ఎంత మందికి కరోనా అంటిందోనని ఆందోళనకు గురవుతున్నారు. ముందు జాగ్రత్తగా గ్రమస్తులందరూ హోంక్వారంటైన్ లో ఉండాలని అధికారులు ఆదేశించారు.