తెలంగాణలో కొత్తగా 3,982 మందికి కరోనా పాజిటివ్

తెలంగాణలో కొత్తగా 3,982 మందికి కరోనా పాజిటివ్

తెలంగాణలో మరోసారి తక్కువ సంఖ్యలోనే కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 71,616 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,982 పాజిటివ్ కేసులుగా నిర్ధారణ అయ్యాయి. దీనికి సంబంధించి ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.GHMC పరిధిలో 607 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 262, ఖమ్మం జిల్లాలో 247, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 225 కేసులు గుర్తించారు. అతి తక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో 18 కేసులు నమోదయ్యాయి. 
మరోవైపు 5,186 మంది కరోనా నుంచి కోలుకోగా, 27 మంది మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు 5,36,766 పాజిటివ్ కేసులు నమోదు కాగా..4,85,644 మంది కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 3,012కి చేరింది.

తెలంగాణలో కరోనా రికవరీ రేటు మరింత పెరిగింది. ప్రస్తుతం తెలంగాణ రికవరీ రేటు 90.47 శాతం కాగా..జాతీయస్థాయిలో అది 85.6 శాతంగా నమోదైంది.