ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్‌కు క‌రోనా 

ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్‌కు క‌రోనా 

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హరిచందన్ ఇవాళ(బుధవారం) ఉదయం అస్వస్థతకు గురయ్యారు. దీంతో.. ఆయనను విజయవాడ నుంచి హైదరాబాదుకు ప్రత్యేక విమానంలో తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో మధ్యాహ్నం చేర్పించారు. ఆయనకు డాక్టర్లు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది.  దీనికి సంబంధించి ఏఐజీ డాక్టర్లు హెల్త్ బులెటిన్ లో తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఆక్సిజన్ అందిస్తున్నట్లు తెలిపారు.