కేంద్ర మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్‌కు కరోనా పాజిటివ్

కేంద్ర మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్‌కు కరోనా పాజిటివ్

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్‌కు కరోనా సోకింది. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చిందని ఆయన తెలిపారు. డాక్టర్లను సంప్రదించి చికిత్స పొందుతానని చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని క్రిషన్ పాల్ గురువారం ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఈ విషయంలో అశ్రద్ధ చేయవద్దని, కరోనా నిబంధనలు పాటించి క్వారంటైన్‌లో ఉండాలని ఆయన సూచించారు.