
హోళీ పండుగ సందర్భంగా హోళిక దహనం చేయడం సంప్రదాయం. కానీ, ముంబైలో సోమవారం వెరైటీగా కరోనా దహనం చేశారు. ప్రాణాంతక కరోనా వైరస్ బెడద వదిలిపోవాలని దేవుడిని ప్రార్థిస్తూ ‘కరోనాసుర’ వైరస్ అని పేరు పెట్టి.. ఈ వేడుకను నిర్వహించారు. ముంబైలోని వోర్లీ ఏరియాలో ఈ వెరైటీ హోళికా దహనం జరిగింది. దేశంలో కరోనా వైరస్ పూర్తిగా నిర్మూలన జరగాలని కోరుకుని ఇలా హోళిక దహన వేడుకను చేసినట్లు చెప్పారు స్థానికులు.
Mumbai: An effigy based on the theme of #CoronaVirus has been put up in Worli, ahead of 'Holika Dahan' today. #Holi pic.twitter.com/yX01NWqzZi
— ANI (@ANI) March 9, 2020
అలాగే ముంబైలోని మరికొన్ని ఏరియాల్లో హోళిక దహనాన్ని వేర్వేరు థీమ్స్తో నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా దిష్టి బొమ్మలను చేసి తగలబెట్టారు. కొన్ని ఏరియాలో నిర్భయ దోషుల సంహారం థీమ్తో బొమ్మలను చేశారు. ఓ మహిళా యోధురాలు నిర్భయ దోషుల తలలను చేతబట్టుకుని ఉన్నట్లుగా బొమ్మలు రూపొందించారు.