న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దెబ్బకు మిగతా అన్ని జట్ల ఒలింపిక్స్సన్నాహాలు దెబ్బతిన్నా..తాము మాత్రం ట్రెయినింగ్ కొనసాగిస్తున్నామని నేషనల్ హాకీ టీమ్ చీఫ్ కోచ్ గ్రహమ్ రీడ్ చెప్పాడు. కరోనా ప్రభావాన్ని తగ్గించడానికి స్పోర్ట్స్అథారిటీ ఆఫ్ఇండియా (సాయ్), హాకీ ఇండియా (హెచ్ఐ) తీసుకుంటున్న చర్యలను రీడ్ మెచ్చుకున్నాడు. రోజురోజుకూ పరిస్థితులు మారిపోతున్నాయని, అయినా వేరే దేశాలతో పోలిస్తే మనం ట్రెయినింగ్ ను కొనసాగిస్తున్నామని పేర్కొన్నాడు. ‘టీమిండియా ప్లేయర్లు ఐసోలేషన్లో ఉన్నప్పటికీ షెడ్యూల్ ప్రకారం సన్నాహకాలు చేస్తున్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ కుటుంబాలతో ఉంటూనే పెర్త్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అర్జెంటీనా ప్లేయర్లు సెంట్రలైజ్డ్ ప్రోగ్రామ్ను ప్లాన్ చేసినప్పటికీ.. ఈ పరిస్థితుల్లో వారు ట్రెయినింగ్ చేయడం కష్టమే.
మన జట్టు మాత్రం ఒకే దగ్గర ఉంటూ సన్నాహకాలు చేస్తోంది. క్యాంపులో మొత్తం 32 మంది ప్లేయర్లు ఉన్నారు. వారితో కాంపిటీటివ్ హాకీ ఆడిస్తున్నాం. ఇంటర్నేషనల్ లెవెల్ ట్రెయినింగ్ సాగుతోంది. ప్రతి రోజు వైవిధ్యమైన స్టయిల్స్ లో హాకీ ఆడుతున్నారు. ఒక రోజు జర్మన్స్లా, మరో రోజు ఆస్ట్రేలియాలా.. విభిన్న రీతిల్లో ప్రాక్టీస్ కొనసాగుతోంది. హాకీ ఇండియాతోపాటు గవర్నమెంట్ నుంచి తదుపరి సూచనల కోసం ఎదురుచూస్తున్నాం. దాని ప్రకారం అవసరమైతే మా ఒలింపిక్ ప్రిపరేషన్ ను రీ షెడ్యూల్ చేస్తాం. ఒలింపిక్స్ వాయిదాపై ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్, టోక్యో గేమ్స్ఆర్గనైజర్లు నిర్ణయం తీసుకుంటారు. ప్రపంచ క్రీడల్లో భాగం కావాలనేది ప్రతి ఒక్క అథ్లెట్ చిరకాల కోరిక. ఇలాంటి సమయంలో ప్లేయర్లు పాజిటివ్ మైండ్సెట్తో ఉండాలి. ఒలింపిక్స్లో ఆడతామనేదే వారికి అతిపెద్ద స్ఫూర్తి. ఇటీవల టాప్–-3 టీమ్స్తో మూడు ప్రొ లీగ్మ్యాచ్ల్లో తలపడ్డాక.. శక్తిమేరఆడితే ఏదైనా చేయగలమనే నమ్మకానికి వచ్చాం’ అని వివరించాడు.