మంత్రులను కలిసిన కార్పొరేషన్ చైర్మన్లు

మంత్రులను కలిసిన కార్పొరేషన్ చైర్మన్లు

హైదరాబాద్, వెలుగు :  నామినేటెడ్ పదవులు దక్కిన పలువురు కార్పొరేషన్ చైర్మన్లు సోమ వారం మంత్రులను కలిసి ధన్యవాదాలు తెలి పారు. బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ను అర్బన్ ఫైనాన్స్ ఇన్​ఫ్రాస్టక్చర్ చైర్మన్ చల్లా నర్సింహరెడ్డి, గిరిజన కో ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఫిషరీస్ కో ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీమ్ కలిశారు. తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఫిల్మ్​ డెవలప్ మెంట్ కార్పొ రేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చైర్మన్లకు మంత్రులు సూచించారు.