అన్ని పార్టీలలో అవీనీతి రాజ్యమేలుతుంది

అన్ని పార్టీలలో అవీనీతి రాజ్యమేలుతుంది

వరంగల్: రాజకీయం వ్యాపారం గా మారింది…రాజకీయ పార్టీలలో అవీనీతి రాజ్యమేలుతుందని ద్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ టీపీసీ అదికార ప్రతినిది అద్దంకి దయాకర్. గురువారం హన్మకొండలో సమా సమాజం.. సమాలోచన లో ఓరుగల్లు పేరుతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి బీసీ , దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి టీపీసీసీ అదికార ప్రతినిది అద్దంకి దయాకర్ హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత రాజకీయాలు వ్యాపారమవుతున్న వేళ సామాన్య వర్గాల ప్రజలకు అవకాశాలు దక్కడం లేదని ఆయన విమర్శించారు.

అన్ని రాజకీయ పార్టీల్లోనూ అవినీతి రాజ్యమేలుతోందిని…సామాన్యులకు సైతం రాజకీయం అందుబాటులో ఉండే పరిస్థితులు లేవన్నారు. అన్నిరాజకీయ పార్టీలల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీలకు, మహిళలకు పదవులల్లోనే కాదూ అవకాశాల్లో సముచిత స్థానం కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజకీయంగాను, ఆర్ధికంగా ఎదుగుదల లేకుండా అణిచి వేస్తున్నారు. అందుకే త్వరలోనే తమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు అద్దంకి దయాకర్.