కరోనా ట్రీట్మెంట్ ఖర్చు వెయ్యిలోపే

కరోనా ట్రీట్మెంట్ ఖర్చు వెయ్యిలోపే

హైదరాబాద్, వెలుగు: కరోనా ట్రీట్మెంట్ కు రూ.వెయ్యిలోపే ఖర్చవుతుందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా పేషేంట్లకు ఇచ్చే మందులన్నీ ఐదు, పది రూపాయలకు దొరికేవేనని మంత్రి స్పష్టం చేశారు. ఆక్సిజన్ కు కూడా పెద్దగా ఖర్చు కాదని, వరసగా పది రోజులు ఆక్సిజన్ పెట్టినా రూ.2,500లోపు మాత్రమే ఖర్చు అవుతుందని చెప్పారు. పరిస్థితి విషమంగా ఉన్నవాళ్ళకు మాత్రమే కొంత ఖరీదైన మెడిసిన్ అవసరం అవుతుందన్నారు. కోఠిలోని కరోనా కమాండ్ సెంటర్‌‌లో మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్ హాస్పిటలైనా, ప్రభుత్వ ఆస్పత్రులైనా కరోనా పేషెంట్లకు ఇచ్చే మందులు ఒకటేనన్నారు.

ప్రైవేట్ ఆస్పత్రుల తీరు హీనం

కరోనా ట్రీట్మెంట్ను వ్యాపారంలా చూడొద్దని చెప్పి నా ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లువినడం లేదని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఇచ్చిన ప్యాకేజీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు. హాస్పిటల్ కు పోగానే రూ.2 లక్షలు అడ్వాన్స్ కట్టించుకోవడం, రోజుకు రూ.లక్షకు తగ్గకుండా చార్జ్చేయడం, పేషెంట్చనిపోతే డెడ్ బాడీని కూడా అప్పగించకపోవడం వంటి చర్యలపై వందల, వేల ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రుల తీరు చాలా హీనంగా, మానవత్వానికే కళంకంగా ఉందన్నారు. డబ్బులు సంపా దించడానికి, ప్రజలను బ్లాక్మెయిల్చేయడానికి సమయం కాదని హితవు పలికారు. కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్లు.. చనిపోయే స్థితిలో ఉన్న పేషెంట్లను , డబ్బులు కట్టలేని స్థితిలో ఉన్న పేషెంట్లను చివరి నిమిషంలో ప్రభుత్వ దవాఖాన్లకు పంపుతున్నాయని మండిపడ్డారు. దీనిపై ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలతో మాట్లాడినట్టు మంత్రి వెల్లడించారు. పద్ధతి మార్చుకోని హాస్పిటల్స్‌పై చర్యలు ప్రారంభించామని, విచారణ కొనసాగుతోందని చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో మరికొన్ని హాస్పిటల్స్పై చర్యలు తీసుకుంటామన్నారు. కంగారు పడి ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్లిడబ్బులు వృథా చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. కమ్యునిటీ హెల్త్సెంటర్లు, ఏరియా, జిల్లా హాస్పిటళ్లు, టీచింగ్ హాస్పిటల్స్‌అన్నింటిలోనూ కరోనా ట్రీట్మెంట్ అందించేందుకు ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు.

కరోనాకు చంపేంత శక్తి లేదు

కరోనా విషయంలో జరిగిన ప్రచారమంతా తప్పు అని ఇప్పుడు అరమవు్థ తోందని, దానికి మనిషిని చంపే శక్తి లేదని ఈటల అన్నారు. వైరస్ ముదిరే వరకూ ఆగితే మాత్రం ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్నారు. దగ్గు, జలుబు, రం.. ఏదొచ్చినా నిరక్ష్ల్యం చేయొద్దని, వెంటనే దగ్గర్లోని ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్లాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొంత మంది లక్షణాలు కనిపించినా నిరక్ష్ల్యం చేస్తున్నారన్నారు. దీంతో నాలుగైదు రోజుల్లోనే పరిస్థితి విషమిస్తోందన్నారు. వెంటిలేటర్‌‌వరకూ వెళ్ళే వరకు ప్రాణాలు కోల్పోతున్నారని ఈటల చెప్పారు. లక్షణాలు కనిపిస్తేనిరక్ష్ల్యం చేయకుండా డాకర్ట్లను సంప్రదించాలని ఆయన సూచించారు