ఉట్నూరు, వెలుగు: అప్పుల బాధతో ఓ గిరిజన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్జిల్లా పాత ఉట్నూరు నాగిరెడ్డి నగర్లో ఉంటున్న జాదవ్తాతేరావ్(59) మూడెకరాలతోపాటు అదనంగా మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట వేశాడు. పెట్టుబడుల కోసం రూ. 3 లక్షల వరకు అప్పు చేశాడు.
ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో అప్పు ఎలా తీర్చాలోనని ఆందోళనకు గురయ్యాడు. శుక్రవారం ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే సర్కార్హాస్పిటల్కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్లోని రిమ్స్కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హాస్పిటల్లో మృతిచెందాడు.