హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లోని 650 పైగా చిన్న, సన్నకారు రైతులకు శాస్త్రీయ విధానంలో పౌల్ట్రీ పెంపకంపై శిక్షణ ఇచ్చామని సహజ పద్ధతుల్లో పెంచిన నాటుకోళ్ల మాంసం అమ్మే కంట్రీ చికెన్ కంపెనీ ఫౌండర్ సాయికేశ్ గౌడ్ వెల్లడించారు.
హైదరాబాద్ బంజారాహిల్స్లో ఎనిమిదో ఔట్లెట్ను ప్రారంభించాక మీడియాతో మాట్లాడుతూ...రైతులకు బై బ్యాక్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. కోళ్లను పెంచేవారిలో 75 శాతానికి పైగా మహిళలు ఉన్నారని వెల్లడించారు. ఈ ప్రీమియం ఎక్స్పీరియన్స్ స్టోర్లో నాణ్యమైన కోడి మాంసం దొరుకుతుందని ప్రకటించారు. కంట్రీ మటన్, కంట్రీ క్యాచ్ (సీఫుడ్) విభాగాలను కూడా మొదలుపెట్టామని తెలిపారు.
