
హైదరాబాద్, వెలుగు: గణేశ్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ, రాబోయే ఎలక్షన్స్ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై సిటీ సీపీ ఆనంద్ ఫోకస్ పెట్టారు. బందోబస్తులో కీలకంగా మారిన సిటీ సెక్యూరిటీ వింగ్(సీఎస్డబ్ల్యూను) మంగళవారం సందర్శించారు. సిటీ ఆర్మ్డ్ రిజర్వ్, సీఎస్డబ్ల్యూ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. వీఐపీల
సెక్యూరిటీ ముందస్తు బందోబస్తుకు అవసరమైన డాగ్స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, మౌంటెడ్ పోలీస్ ఫోర్స్ యూనిట్లను ఆయన పరిశీలించారు. మౌంటెడ్ పోలీస్లోని 46 గుర్రాలు, డాగ్ స్క్వాడ్లోని 26 డాగ్స్ పనితీరును సంబంధిత హ్యాండ్లర్స్ను అడిగి తెలుసుకున్నారు.
పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి
మెహిదీపట్నం: ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం మాసబ్ ట్యాంక్ లోని ప్యాప్సీలో గణేశ్ విగ్రహ నిర్వాహకులతో, నాంపల్లి పోలీస్ స్టేషన్ లో పీస్ కమిటీతో ఆయన సమావేశమయ్యారు. డీసీపీ మాట్లాడుతూ.. వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీని ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు.