మరియమ్మ కేసులో ఎస్సై, కానిస్టేబుళ్లను డిస్మిస్ చేసిన సీపీ

మరియమ్మ కేసులో ఎస్సై, కానిస్టేబుళ్లను డిస్మిస్ చేసిన సీపీ

అడ్డగూడురులో లాకప్ డెత్‌కు గురైన మరియమ్మ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు పడింది. ఈ కేసులో అడ్డగూడురు ఎస్సై  మహేశ్వర్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యలను విధుల నుంచి డిస్మిస్ చేశారు. లాకప్ డెత్‌పై  పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఇప్పటివరకు  సస్పెన్షన్‌లో ఉన్న ఈ ముగ్గురిని విధుల నుంచి పూర్తిగా తొలగిస్తూ రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు.

మరియమ్మ లాకప్ డెత్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. పోలీసులు కొట్టడం వల్లే మరియమ్మ చనిపోయిందని కుటుంబ సభ్యులు పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. లాకప్ డెత్  చేసిన ఎస్సై, కానిస్టేబుళ్లను అరెస్ట్ చేయకుండా కేవలం డిస్మిస్ చేసి చేతులు దులుపుకున్నారని మరియమ్మ కుటుంబసభ్యులు ఆరోపించారు.