తిరుపతి వెంకన్న సాక్షిగా నడ్డావి అన్నీ అబద్దాలే : సీపీఐ నేత నారాయణ

తిరుపతి వెంకన్న సాక్షిగా నడ్డావి అన్నీ అబద్దాలే : సీపీఐ నేత నారాయణ

తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర నిల్చుని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నీ అబద్దాలే చెప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. మేకిన్ ఇండియా మేడిన్ ఇండియా అని చెప్పి.. ఇతర దేశాల్లో తయారైన స్పేర్ పార్ట్ లను తీసుకువచ్చి.. ఇక్కడ ఫిట్ చేస్తున్నారని చెప్పారు. 20 శాతం కస్టమ్ డ్యూటీ నుండి  తప్పించుకోవడానికి అక్కడి స్పేర్ స్పార్ట్స్ తీసుకువచ్చి.. ఇక్కడ ఫిట్ చేస్తున్నారని ఆరోపించారు. తాము రాజకీయంగా బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. 

‘‘బీజేపీ వాళ్లు, చంద్రబాబు ఏం మాట్లాడుకున్నారో మాకు తెలయదు. కానీ.. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిసిన వెంటనే ఆ పార్టీ వాళ్లు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి వైసీపీని విమర్శిస్తున్నారంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఏపీ రాష్ర్ట ప్రభుత్వంపై బీజేపీ నాయకులు చేసిన ఆరోపణలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించాలి’’ అని నారాయణ కోరారు.