సీట్లు ఎక్కడిచ్చినా పోటీకి రెడీగా ఉండాలె: సీపీఐ స్టేట్ కౌన్సిల్

సీట్లు ఎక్కడిచ్చినా పోటీకి రెడీగా ఉండాలె: సీపీఐ స్టేట్ కౌన్సిల్

హైదరాబాద్, వెలుగు: తాము ప్రతిపాదించిన సీట్లలో ఏ స్థానాలను కాంగ్రెస్ కేటాయించినా పోటీకి సిద్ధంగా ఉండాలని సీపీఐ స్టేట్ కౌన్సిల్ నిర్ణయించింది. సోమవారం మగ్దుంభవన్ లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ తో పొత్తులపై చర్చించారు. కొత్తగూడెం, హుస్నాబాద్, మునుగోడు, బెల్లంపల్లి, వైరా తదితర సీట్లను ఇవ్వాలని కాంగ్రెస్​కు ప్రతిపాదించగా వీటిలో రెండు లేదా మూడు సీట్లు ఇచ్చే చాన్స్​ఉందని నేతలు తెలిపారు. 

ఇచ్చిన స్థానాల్లో అభ్యర్థులను గెలిపించునేలా ప్రణాళికలు రెడీ చేసుకోవాలని సూచించారు. అయితే కొత్తగూడెం సీటును మాత్రం వదులుకోవద్దని కౌన్సిల్​లో రాష్ట్ర ప్రధాన నేతలకు సూచించినట్టు తెలిసింది. సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శులు కె.నారాయణ, అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.