ఏపీ సీఎం జగన్‌ను కలసిన అనిల్‌ కుంబ్లే

ఏపీ సీఎం జగన్‌ను కలసిన అనిల్‌ కుంబ్లే

అమరావతి: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మాజీ కోచ్.. అనిల్ కుంబ్లే ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. సోమవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయనకు  జ్ఞాపికను అందజేశారు. కర్నాటక రాష్ట్రానికి చెందిన అనిల్ కుంబ్లే సీఎం జగన్‌ను కలవడం విశేషం. టీమిండియా క్రికెట్ జట్టుకు ఎంపికైన తర్వాత ఎన్నోసార్లు భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన అనిల్ కుంబ్లే అంచెలంచెలుగా ఎదిగి కెప్టెన్సీని.. రిటైర్ అయ్యాక కోచ్ గాను వ్యవహరించారు. అంతేకాదు బీసీసీఐలో పలు ఉన్నత పదవులను అలంకరించిన అనిల్ కుంబ్లే ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం జగన్ ను కలవడం హాట్ టాపిక్ అయింది. కారణాలు అనిల్ కుంబ్లే కాని.. ఏపీ సీఎం జగన్ కార్యాలయ వర్గాలు కాని వెల్లడించలేదు.