ఎండాకాలం ప్రారంభంలోనే రైతన్నలకు విద్యుత్ కష్టాలు ప్రారంభమయ్యాయి. పవర్ కట్లతో పంటలు ఎండుతున్నాయంటూ మెదక్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ఇష్టారాజ్యంగా చేస్తున్న కరెంట్ కోతలతో వరి పొలం ఎండిపోతుందని నర్సాపూర్, తూప్రాన్ రొడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. శివంపేట మండలం పాంబండ, ఉసిరికపల్లి గ్రామాల ప్రజలు రొడ్డు పై నిరసనలు తెలియజేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. 24 గంటల కరెంట్ ఇస్తామన్న కేసీఆర్ మోసం చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.
For More News..