మిస్సయిన జవాన్‍ దొరికాడు

మిస్సయిన జవాన్‍ దొరికాడు

సికింద్రాబాద్, వెలుగు: CRPF జవాన్ సల్దీప్ కుమార్ మిస్సింగ్‍ మిస్టరీని సికింద్రాబాద్ GRP పోలీసులు ఛేదించారు. సీఐ కథనం ప్రకారం..జమ్మూకాశ్మీర్ నుంచి రిలీవింగ్ ట్రాన్స్ ఫర్ . CRPF ఏఎస్సై అర్జున్దుబే,13 మంది జవాన్లు ఈ నెల 20న ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ కు తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో వచ్చారు. రంగారెడ్డి జిల్లా CRPF హెడ్ క్వార్టర్స్ లో వీరు రిపోర్టు చేయాల్సి ఉంది. కానీ, వీరిలో సల్దీప్ కుమార్ అనే జవాన్‍ మిస్సయ్యా డు. ఇతడి స్వగ్రామం జమ్మూకాశ్మీర్ లోని స్వాంక. ఈ నెల 22న CRPF ఏఎస్సై ఫిర్యా దు మేరకు GRP ఎస్సై రమేశ్ దర్యాప్తు చేశారు. ఆదివారం రాత్రి సికింద్రబాద్‍ రైల్వే స్టేషన్‍లో సదరు జవాన్‍ ఆచూకీ కనునగొన్నారు. తన సెల్ ఫోన్‍ పోవడంతో ఎక్కడ దిగాలో తెలియక తికమకపడ్డట్లు జవాన్‍ తెలిపాడు. అనంతరం రంగారెడ్డి CRPF హెడ్ క్వార్టర్స్ లో ఆయన రిపోర్ట్ చేశాడు.