
మనం ఏదైనా హోటల్కి వెళ్తే మనకు సర్వ్ చేసిన వెయిటర్కు పదో, పాతికో టిప్గా ఇస్తాం. కానీ, పెన్సిల్వేనియాకు చెందిన ఓ కస్టమర్ మాత్రం.. తనకు సర్వ్ చేసిన వెయిటర్కు రూ. 3 లక్షలకు పైగా టిప్గా చెల్లించారు. వివరాల్లోకి వెళ్తే.. పెన్సిల్వేనియాకు చెందిన జియానా డిఆంజిలో
వైడనర్ యూనివర్సిటీలో నర్సింగ్ చదువుతోంది. ఆమె చదువుకుంటూనే ఆంథోనిస్ ఇటాలియన్ రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేస్తుంది. రోజూవారీలాగానే డిసెంబర్ 12న కూడా జియానా కాలేజీ తర్వాత రెస్టారెంట్కి వెళ్లింది. ఆ రోజు ఆమె ఒక టేబుల్కు సర్వ్ చేసింది. ఆ టేబుల్ బిల్లు 205 డాలర్లు అయింది. ఆ బిల్లును జియానా తన కస్టమర్కు ఇచ్చింది. ఆ తర్వాత జియానా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయింది. కాసేపటి తర్వాత టేబుల్ క్లీనింగ్ కోసం వచ్చిన జియానా.. టిప్ ఏమైనా పెట్టారేమోనని బిల్లు బుక్ ఓపెన్ చేసి చూసింది. అది చూసిన జియానా షాక్ అయింది. అందులో కస్టమర్ ఏకంగా 5000 డాలర్లు టిప్గా పెట్టి పోయారు. టిప్ 5 వేల డాలర్లు అంటే.. మన కరెన్సీలో అక్షరాల రూ. 3, 67, 243 రూపాయలు. అంత టిప్ ఇచ్చేసరికి జియానాకు మాటలు రాలేదు. ఆ డబ్బు తన చదువుకు ఉపయోగపడటంతోపాటు.. కొంతమంది పేదలకు సాయం చేయడానికి పనికొస్తుందని జియానా తెలిపింది. రెగ్యూలర్గా తమ రెస్టారెంట్కు గ్రూపుగా వచ్చే కొంతమంది కస్టమర్లు ఈ టిప్ ఇచ్చారని ఆమె తెలిపింది. ఈ బిల్లును సదరు రెస్టారెంట్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అది చూసిన నెటిజన్లు.. ఓ వెయిటర్ చదువుకు హెల్స్ చేసినందుకు ఆ కస్టమర్లను ఎంతో ప్రశంసించారు. మరికొంత మంది మాత్రం ఈ టిప్ క్రిస్మస్ కానుక అని అంటున్నారు.
For More News..