1 కేజీ 329 గ్రాముల గోల్డ్ సీజ్

1 కేజీ 329 గ్రాముల గోల్డ్ సీజ్

శంషాబాద్, వెలుగు : అక్రమంగా బంగారం తెచ్చిన ప్యాసింజర్ ను శంషాబాద్ ఎయిర్ట్ పోర్టు కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. శనివారం దుబాయి నుంచి చెన్నై మీదుగా శంషాబాద్ కు వచ్చిన ఫ్లైట్ లో  ఓ ప్రయాణికుడు అక్రమంగా గోల్డ్ తెస్తున్నాడనే సమాచారం అందింది. దీంతో కస్టమ్స్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు.

గోల్డ్ పేస్టు విమాన టాయిలెట్ లోని వాష్ బేసిన్ కింద దాచినట్టు గుర్తించారు. సుమారు1 కేజీ 329 గ్రాముల గోల్డ్ ను స్వాధీనం చేసుకోగా.. దాని విలువ రూ. 81. 60 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. కస్టమ్స్ చట్టం –1962 కింద ప్యాసింజర్ పై కేసు నమోదు చేసినట్టు చెప్పారు.