సీఎం కేసీఆర్ ఫోటోలు మార్ఫింగ్ చేసిన వ్యక్తికి నోటీసులిచ్చారు సైబరాబాద్ క్రైం పోలీసులు. కేసీఆర్ ఫోటోలు మార్ఫింగ్ చేసి కించపరిచే విధంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వ్యక్తిని చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ ఐటీ సెల్ ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ తెల్లవారుజామున
నిర్మల్ జిల్లాకు చెందిన సతీష్ చంద్ర అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని హైదరాబాద్ కి తీసుకు వచ్చిన పోలీసులు నోటీసులిచ్చారు .