- ఉత్తర్వులు జారీ చేసిన సీపీ అవినాష్ మహంతి
గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్లో భారీ ఎత్తున ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. సైబరాబాద్ కమిషనరేట్పరిధిలో 21 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ అవినాష్మహంతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్గా ఉన్న వెంకన్న కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్గా, శంషాబాద్ సీసీఎస్ ఇన్స్పెక్టర్గా ఉన్న వీరబాబు రంగారెడ్డి జిల్లా మోకిల పీఎస్ ఇన్ స్పెక్టర్గా ట్రాన్స్ఫర్ అయ్యారు. రాయదుర్గం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ శంషాబాద్ ఇన్స్పెక్టర్గా, మాదాపూర్ సీసీఎస్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసరావు జీడిమెట్ల ఇన్ స్పెక్టర్గా బదిలీ అయ్యారు. కొల్లూరు ఇన్ స్పెక్టర్ సంజయ్ కుమార్ స్పెషల్ బ్రాంచ్(ఎస్ బీ)కి, నందిగామ ఇన్స్పెక్టర్ సురేశ్ బాలానగర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్గా బదిలీ అయ్యారు.
జీడిమెట్ల ఇన్ స్పెక్టర్ పవన్ శంషాబాద్ సీసీఎస్ కు, మేడ్చల్ డీఐ ప్రసాద్ నందిగామ ఇన్ స్పెక్టర్గా, బాలానగర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ నరహరి ఈవోడబ్ల్యూ ఇన్ స్పెక్టర్గా, కూకట్ పల్లి ఇన్ స్పెక్టర్ సురేందర్ మేడ్చల్ సీసీఎస్ కు ట్రాన్స్ ఫర్ అయ్యారు. మేడ్చల్ సీసీఎస్ ఇన్ స్పెక్టర్ శంకరయ్య దుండిగల్ ఇన్ స్పెక్టర్ గా, దుండిగల్ ఇన్ స్పెక్టర్ రామకృష్ణ సైబరాబాద్ ట్రాఫిక్అడ్మిన్కు బదిలీ అయ్యారు. శంషాబాద్ ఇన్ స్పెక్టర్ శ్రీధర్ కుమార్ ఈడబ్ల్యూకు, సనత్ నగర్ ఇన్ స్పెక్టర్ బాలరాజు సైబరాబాద్ సీటీసీకి, రాజేంద్రనగర్ ఎస్ వోటీ ఇన్ స్పెక్టర్ విజయ్ నాయక్ మాదాపూర్ డీఐగా, జగద్గిరిగుట్ట డీఐ గణేశ్ పటేల్ రాయదుర్గం ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ గా ట్రాన్స్ ఫర్ అయ్యారు. వీరితో పాటు కూకట్ పల్లి ఇన్ స్పెక్టర్ గా కృష్ణ మోహన్, సనత్ నగర్ ఇన్ స్పెక్టర్ గా పురేందర్ రెడ్డి, మాదాపూర్ ఇన్స్పెక్టర్గా మల్లేశ్ను నియమిస్తూ సీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.