ఒక్క విషయం చెబుతా గుర్తు పెట్టుకో సిన్నప్పా!

ఒక్క విషయం చెబుతా గుర్తు పెట్టుకో సిన్నప్పా!

హైదరాబాద్: సైబర్ మోసాలు, హైటెక్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో సైబరాబాద్ పోలీసులు ఎప్పుడూ ముందుంటారు. ఈ కరోనా టైమ్ లో వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా జనాలను ఎప్పుడూ అలర్ట్ చేస్తూంటారు. సినిమాలన్నా, స్టార్లన్నా తెలుగు ప్రజలకు అభిమానం ఎక్కువ. కాబట్టి ప్రముఖ సినిమాలు, అందులోని స్టార్ల డైలాగులను ఎడిట్ చేసి ప్రజలను సందేశాలు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

రీసెంట్ గా మోస్ట్ అవేటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ లో తారక్, చెర్రీ బైక్ పై ఉన్న పోస్టర్ ను హెల్మెట్ ధరించాలనే మెసేజ్ చెప్పేందుకు వాడుకుంది సైబరాబాద్ పోలీసు టీమ్. ఇప్పుడు తాజాగా విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న విక్టరీ వెంకటేశ్ మూవీ నారప్పలోని ఒక డైలాగ్ ను మాస్కులు వేసుకోవాలని చెప్పేందుకు క్రియేటివ్ గా వాడుకున్నారు. నారప్ప సినిమా పోస్టర్‌లోని వెంకటేష్ ముఖానికి మాస్క్ తగిలించి.. ‘ఒక్క విషయం చెబుతాను బాగా గుర్తుపెట్టుకో సిన్నప్ప.. మాస్క్‌ పెట్టుకో సిన్నప్పా, కరోనా ఇంకా ముగిసిపోలేదు’అంటూ మీమ్‌ క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో వదిలారు. ప్రస్తుతం ఈ మీమ్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.