హాస్టల్లో ఉంటూ గంజాయి అమ్ముతున్న యువకులు అరెస్ట్

హాస్టల్లో ఉంటూ గంజాయి అమ్ముతున్న యువకులు అరెస్ట్

సైబరాబాద్ SOT టీమ్ రెండు చోట్ల తనిఖీలు నిర్వహించిన మొత్తం 1.4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తమకు వచ్చిన కచ్చితమైన సమాచారం మేరకు KPHB పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ వేదా హాస్టల్ లో రైడ్స్ చేపట్టారు. ఇందులో భాగంగా నందిగామ సాయి తేజ (పాత నేరస్థుడు), కొత్తపల్లి నాగ శ్రీనివాస్ అనే ఇద్దరు యువకులను పట్టుకున్నారు.

ఆ ఇద్దరు యువకులు ఉంటున్న రూం నంబర్ 301 నుంచి అమ్మకానికి సిద్ధం చేసిన.. 750 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని KPHB పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు కుత్బుల్లాపూర్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కైసర్ నగర్ లో మేడ్చల్ SOT పోలీసులు దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా గంజాయి విక్రయిస్తున్న బ్రిజేష్ కుమార్ పాండే(30) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 650 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.