రాష్ట్రంలో వాతావరణ సూచన

రాష్ట్రంలో వాతావరణ సూచన

రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ సూచనలు చేసింది.

వాతావరణ విశ్లేషణ:
ఈ రోజు ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరంలో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైదని వాతావరణ తెలిపింది. ప్రస్తుతం వాయువ్య దిశను ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా ఏర్పాడింది. ఒడిశాను ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద ఇది ఉంది. దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, నైరుతి దిశగా వంగి ఉంది. వచ్చే 48 గంటల్లో తీవ్ర అల్పపీడనం ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలేవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఋతుపవనాల ద్రోణి ప్రస్తుతం సముద్ర మట్టం వద్ద జైసల్మేర్ నుండి వాయువ్య ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై అల్పపీడన ప్రాంత కేంద్రం.. ఒడిశాను ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం, ఆగ్నేయ దిశగా ఉత్తర అండమాన్ సముద్రం వరకు వ్యాపించి ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. 

వాతావరణ సూచన : 
రాగల మూడు రోజులలో రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.

వాతావరణ  హెచ్చరికలు : 
ఈ రోజు రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు గంటకు 30 నుండి 40కి మీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలపింది.