- దండోరా అధ్యక్షుడు సతీశ్ మాదిగ
హైదరాబాద్, వెలుగు : రాజకీయంగా లబ్ధి పొందేందుకే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాదిగలకు న్యాయం చేస్తామని మాయ మాటలు చెబుతున్నారని దండోరా అధ్యక్షుడు సతీశ్ మాదిగ విమర్శించారు. సోమవారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మభ్యపెట్టి మాదిగల ఓట్లు దండుకోవడానికే బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ఆర్టికల్ 370కి, ట్రిపుల్ తలాక్కు కమిటీలను వేయలేదని..మరి ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఎందుకని ప్రశ్నించారు. మాదిగల సమస్యలపై కాంగ్రెస్ ఉషామెహ్రా కమిటీని వేసిందని గుర్తున్నారు. మాదిగలకు ఏమి చేయాలో కాంగ్రెస్ కు తెలుసునన్నారు. తల్లి లాంటి కాంగ్రెస్ మాదిగలకు అన్యాయం చేయదని సతీశ్ పేర్కొన్నారు.