- ఇప్పుడు మెంబ్రేన్స్ ఫిల్టరేషన్ టెక్నిక్
- పాత పద్ధతిలో రిపోర్ట్కు 72 గంటలు
- కొత్త విధానంలో 18 గంటల్లోనే క్వాలిటీ తెలుసుకునే చాన్స్..
- రోజూ 4 వేల శాంపిల్స్ పరీక్షిస్తున్న బోర్డు
హైదరాబాద్ సిటీ, వెలుగు: జంట నగరాల్లో నీటి నాణ్యత పరీక్షల కోసం వాటర్బోర్డు ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తోంది. వాటర్క్వాలిటీలో తేడా రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకూ నిర్వహించిన బ్యాక్టీరియల్ అనాలసిస్ టెస్టుకు టాటా చెప్పి కొత్తగా మెంబ్రెన్ ఫిల్టరేషన్ టెక్నిక్తో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తోంది. దీంతో సత్వర ఫలితాలు వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు.
తాగునీటిలో ఇ-కోళి, కోలిఫాం వంటి బ్యాక్టీరియా పెరిగితే అది తాగేవారికి వాంతులు, విరేచనాలు అవుతాయి. ఇలా జరగకుండా ఎప్పటికప్పుడు నీటి నాణ్యత పరీక్షలు జరిపేందుకు ఏడు ల్యాబ్స్రన్చేస్తున్నారు. ఆసిఫ్నగర్ ఫిల్టర్స్బెడ్ ప్రాంగణంలో సెంట్రల్ క్వాలిటీ ల్యాబ్ ఉండగా, సికింద్రాబాద్లో కంట్రోల్ రూం, హైదరాబాద్ నగర్, సాహెబ్ నగర్, రాజంపేట, పెద్దాపూర్లో క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్స్ఉన్నాయి.
మెంబ్రెన్ ఫిల్టరేషన్ టెక్నిక్
ఇప్పటివకు బోర్డు బ్యాక్టీరియల్ అనాలసిస్తో పాటు మోస్ట్ ప్రాబబుల్ నంబర్ఆఫ్ బ్యాక్టీరియా (ఎంపీఎన్) ప్రతి 100 మిల్లీ లీటర్లో ఎంత పర్సెంట్ ఉందన్నది పరీక్షిస్తోంది. ఇందులో సున్నా ఎంపీఎం కంటే ఎక్కువగా వస్తే ఆ నీరు తాగడానికి పనికి రాదు. కానీ, దీన్ని సాధ్యమైనంత తొందరగా గుర్తించాలి. పాత పద్ధతిలో ఫలితాలు రావడానికి కనీసం 72 గంటలు పట్టేది.
కొద్ది కాలంగా బోర్డు లేటెస్ట్ అడ్వాన్సుడ్ టెక్నాలజీ అయిన మెంబ్రెన్ ఫిల్టరేషన్ టెక్నిక్ (ఎంఎఫ్టీ) ఉపయోగిస్తోంది. శాంపిల్స్ సేకరించిన 18 గంటల్లోనే ఫలితాలు వస్తుండడం, అవి కూడా పక్కాగా ఉంటుండడంతో రోజుకు 4వేల వరకూ శాంపిల్స్ సేకరించి ల్యాబ్స్కు పంపిస్తున్నారు. అలాగే యాప్ద్వారా ఆయా ప్రాంతాల్లోని లైన్మెన్లు కూడా సరఫరా అవుతున్న నీటిలో క్లోరిన్ పరిమాణాన్ని రియల్ టైమ్లో చెక్ చేస్తున్నారు.
సరఫరా టైంలోనే పరీక్షలు
వాటర్బోర్డు నీటి సరఫరా జరిగే టైంలో రోజుకు 7 నుంచి 8 వేల శాంపిల్స్ను సేకరించి పరీక్షలను నిర్వహిస్తోంది. థర్డ్పార్టీగా ఇన్స్టిట్యూట్ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) కూడా కొన్ని శాంపిళ్లను తీసుకుని నివేదిక సమర్పిస్తోంది. డబ్ల్యూహెచ్ఓ నామ్స్ ప్రకారం క్లోరినేషన్ 4.5 పీపీఎం వరకూ ఉండొచ్చని, తాము రిజర్వాయర్వద్ద 2 పార్ట్స్పర్ మిలియన్( పీపీఎం) ఉండేలా చూస్తున్నామని అధికారులు చెప్తున్నారు.
ఎక్కువ క్లోరిన్ ఉంటే విరేచనాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వినియోగదారులకు చేసే సరికి 0.5 పీపీఎం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. తాము పరీక్షల్లో ఇ-కోళి, కోలిఫాం బ్యాక్టీరియాను కూడా చెక్చేస్తామని, కొత్త పద్ధతిలో సమయం ఆదా అవ్వడమే కాకుండా రిజల్ట్స్కూడా తొందరగా వస్తున్నాయంటున్నారు.
